Homeక్రైంఎమ్మెల్యే పేరుతో బెదిరింపు కాల్స్‌..!

ఎమ్మెల్యే పేరుతో బెదిరింపు కాల్స్‌..!

– కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి

ఇదేనిజం, మల్కాజిగిరి:తన ఫోన్‌ ఎవరో హ్యాక్‌ చేసి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాచకొండ కమిషనర్‌ చౌహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లకు, నాయకులకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. రెండు రోజుల నుంచి మైనంపల్లి అనుచరుల నుంచే బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తెలిపాడు. బెదిరింపు కాల్స్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు.

Recent

- Advertisment -spot_img