Homeఫ్లాష్ ఫ్లాష్ప్రభాస్ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు

ప్రభాస్ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మువీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ కు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తీస్తున్న చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేశారు.

దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్, హిందీకి మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పాటలే అత్యంత కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు జిల్ రాధాకృష్ణ తెలిపారు.

Recent

- Advertisment -spot_img