Homeహైదరాబాద్latest News‘రైతన్నకు.. మీ రేవంతన్న మాట’

‘రైతన్నకు.. మీ రేవంతన్న మాట’

  • పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం
  • ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం
  • రైతును రాజు చేయడమే మా లక్ష్యం
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగ ట్వీట్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని రైతులను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన ఘనత అన్నారు. నాడు మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో దేశ రైతాంగానికి, నేడు ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ అందించే భరోసా అని చెప్పుకొచ్చారు. రుణమాఫీ అమలులో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా, మలి అడుగు విధివిధానాల ఖరారు అని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందన్నారు. ‘ఇది రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img