Homeహైదరాబాద్latest Newsనేడు కేరళకు CM Revanth Reddy

నేడు కేరళకు CM Revanth Reddy

– కాంగ్రెస్ సమరాగ్ని యాత్ర ముగింపుకు హాజరు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కేరళ వెళ్లనున్నారు. కేరళ తిరువనంతపురంలో సమరాగ్ని యాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరనుననారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ తిరువనంతపురం వెళ్లారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచార యాత్ర సమరాగ్నిని శుక్రవారం కాసర్‌గోడ్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img