శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ నేడు కొలంబో వేదికగా జరగనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ టై కాగా, రెండో వన్డేలో శ్రీలంక 32 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి వన్డేలో గెలిస్తే శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు తప్పిదాలపై టీమ్ ఇండియా దృష్టి సారించింది. రెండు మ్యాచ్ల్లో భారత్ గెలవకపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం, ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శ్రీలంక స్పిన్ను ఆడలేక పెవిలియన్కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయడంపై గౌతమ్ గంభీర్ దృష్టి సారించాడు. కేఎల్ రాహుల్, శివమ్ దూబే స్థానంలో స్పిన్నర్ ర్యాన్ పరాగ్తో పాటు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ జట్టులోకి రానున్నాడు. మూడో వన్డేలో టీమిండియా ఈ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్/కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.