Homeహైదరాబాద్latest Newsగుంటూరు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేష్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21)గా గుర్తించారు.డిప్లొమా పూర్తి చేసిన మహేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లో చేరాడు. అప్పట్లో అక్కడ పనిచేస్తున్న శైలజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు.అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నిరాకరించారు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఇంటి నుంచి వెళ్లిన మహేష్, శైలజ కనిపించకుండా పోయారు.ఈ క్రమంలో ఇవాళ ఉదయం పెదకాకాని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img