శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం, గడ్డం తాండ పంచాయతీకి చెందిన కళ్లి తాండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్, పాకిస్తాన్ సైన్యంతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందినట్లు సమాచారం. ఈ ఘటన భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతల నడుమ జరిగినట్లు తెలుస్తోంది. మురళి నాయక్ భారత సైన్యంలో జవాన్గా సేవలందిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఈ దుఃఖకర సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ గుండెలపగిలే వార్తతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.