దాదాపు 20 ఏళ్లుగా వెండితెరపై హీరోయిన్ త్రిష తన నటనతో జనాలని అలరిస్తుంది. త్రిష తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. త్రిష 40 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలో నటిస్తుంది. త్రిష సినీ జీవితంలో రూమర్స్లో చాలానే వచ్చాయి. ఆమె కొంతమంది హీరోలతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2015లో వ్యాపారవేత్త వరుణ్ మణియన్ని త్రిష పెళ్లి చేసుకోవాలి అనుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. తాజాగా త్రిష తన సోషల్ మీడియా వైదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో.. “నిజమైన ప్రేమ అనేది జీవితంలో ఒక్కసారైన అనుభూతిని కలిగిస్తుంది, ఎవరైనా మిమ్మల్ని మీరు నిజంగా ఉన్నట్లుగా ఉండనివ్వండి మరియు మీ యొక్క కొత్త కోణాలను స్వీకరించినప్పుడు” అని త్రిష చెప్పింది.లవ్ ఎమోజీని కూడా ఆ స్టోరీ లో పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.