తిరుమలను సందర్శించే ఎన్నారైలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఎన్నారైలు, ఎన్ఆర్టీలకు టీటీడీ అందిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్ల కోటాను 50 నుంచి 100కు పెంచుతూ డిప్యూటీ ఈఓ లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం జీఏడీ నుంచి వారి కోటా పెంచాలని జనవరి 6న లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సదుపాయం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో వర్తించదు.