Homeఫ్లాష్ ఫ్లాష్TTDP:మానుకోటపై సైకిల్ జెండా ఎగరాలి-అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

TTDP:మానుకోటపై సైకిల్ జెండా ఎగరాలి-అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

TTDP:పార్టీలో అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ఈసారి మానుకోటలో సైకిల్ జెండాను ఎగురవేయాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సూచించారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు జ్ఞానేశ్వర్ ను కలిశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పూర్తిస్థాయి పార్టీ కమిటీని వేసినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ… మహబూబాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందన్నారు. నాయకులు పార్టీ కేడర్ ను ప్రజలకు అనుసంధానం చేసుకొని వారి మద్దతును పొందదానికి కృషి చేయాలన్నారు. టీడీపీ హయాంలోనే గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని విధాలా న్యాయం జరిగిందన్నారు.. అందుకే ఆ ప్రాంత ప్రజలంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా మంచి జరుగుతుందని పార్టీలోకి వచ్చే వారందరినీ స్వాగతించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

చిన్న పాటి సమస్యలున్నా అందరినీ కలుపుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని నాయకులను ఆదేశించారు.. తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని నాయకులందరూ సమిష్టి కృషితో పనిచేసి.. పార్టీ విజయానికి నాంది పలకాలని నాయకులకు కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.

Recent

- Advertisment -spot_img