Homeహైదరాబాద్latest Newsలారీ బోల్తాపడి ఇద్దరు మృతి

లారీ బోల్తాపడి ఇద్దరు మృతి

  • మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన

ఇదే నిజం, గూడూరు: గూడూర మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులపై టీఎస్ 30 టీ 0899 నంబరు గల వాహనం ఒక్కసారిగా దూసుకొచ్చింది. మచ్చర్ల గ్రామానికి చెందిన చుంచా దేవేందర్ సిఆర్ టీ. టీచర్ గా, ములుగు జిల్లా రామన్నగూడెం గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదేవిధంగా కొంగరగిద్ద గ్రామం గూడూరు మండలానికి చెందిన ధనసరి పాపారావు గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. బాబురావు గన్ మెన్ గా స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధుమిత్రులు జాతీయ రహదారి 365 రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Recent

- Advertisment -spot_img