Homeహైదరాబాద్latest Newsబస్ కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా

బస్ కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా

ఆర్టీసీ బస్ కండక్టర్ విధులను ఆటంకపరచడమే కాకుండా దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్డు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. కృష్ణయ్యపై 2015 మార్చి 15న అలంపూర్‌కు చెందిన చాకలి శ్రీనివాస్, గోపి అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో బస్సు ఎక్కిన శ్రీనివాస్, గోపీలు టికెట్ తీసుకోకపోవడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారు. వారించిన కండక్టర్ కృష్ణయ్యపై దాడి చేశారు. దీంతో తనపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కండక్టర్ కృష్ణయ్య అలంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎస్పై పర్వతాలు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రస్తుతం ఈ కేసు మంగళవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఫైన్ విధించారు. ఈ తీర్పుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేశారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని హెచ్చరించారు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే .. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img