Homeహైదరాబాద్latest NewsGreat Wall Of China గురించి నమ్మలేని నిజాలు

Great Wall Of China గురించి నమ్మలేని నిజాలు

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ గురించి చాలామందికి తెలుసు. ఉత్తర చైనాలో నిర్మించిన పురాతన గోడలు, కోటల సమాహారమే ఈ కట్టడం. 500 ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు. మొదట్లో దీని పొడవు సుమారు 2,400 కి.మీల నుంచి 8,000 కి.మీల మధ్య ఉంటుందని అంచనా వేశారు. కానీ, 2012లో చైనా ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక వారసత్వ విభాగం చేపట్టిన పురావస్తు శాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు దాని కంటే చాలా ఎక్కువని, అంటే 21 వేల కి.మీల పైనే ఉంటుందని తేలింది. చంద్రుడి నుంచి మనుషులు చూడగలిగే ఏకైక కట్టడం ఇదన్నారు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. చైనాకు చెందిన ప్రముఖ సైనాలజిస్ట్, జోసెఫ్ నీధమ్ ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షం నుంచి గుర్తించగలిగే ఒకే ఒక్క మానవ నిర్మితం ఈ గోడ అని చెప్పారు. ఈ విషయాన్ని వ్యోమగాములు కొట్టివేసినప్పటికీ, ఇప్పటికీ చంద్రుని నుంచి చూడగలిగే కట్టడం ఇదని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. 2003లో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి తాము ఏమీ చూడలేకపోయామని ఖగోళ శాస్త్రజ్ఞుడు యాంగ్ లివే చెప్పారు. ఇది ఒకటే గోడ కాదు. చాలా గోడల కలయిక. వీటిలో చాలా విభాగాలున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

చాలా ప్రాంతాల్లో ఈ గోడలు రెండింతలు, మూడింతలు, కొన్నింటి దగ్గర నాలిగింతలు ఎక్కువ వెడల్పులో ఉంటాయి. బీజింగ్‌లో మనకు కనిపించే కొన్ని భవనాలు చాలా పురాతనమైనవి. అందులో కొన్ని చైనా వాల్‌లో భాగంగా ఉంటాయి. గోడ లోపల కార్మికులను సమాధి చేసినట్లు చాలా రూమర్లు చక్కర్లు కొట్టాయి. హన్ రాజవంశం కాలం నాటి ప్రముఖ చరిత్రకారుడు సిమా కియాన్ నుంచి ఈ కట్టు కథలు పుట్టుకొచ్చి ఉంటాయని చరిత్రకారులు నమ్ముతుంటారు. ఈ చరిత్రకారుడి మాటలు ఎలా ఉన్నా, ఈ గోడ లోపల మాత్రం ఎక్కడా మనుషుల ఎముకలు కనిపించలేదు. దీనికి ఎలాంటి పురావస్తు లేదా రాతపూర్వక ఆధారాలు కూడా లేవు. ఇది పూర్తిగా అవాస్తవమని తేలింది. వెనీస్‌కు చెందిన యాత్రికుడు,రచయిత మార్కో పోలో దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నది నిజం. ఆయన దీని గురించి చెప్పకపోవడంతో మార్కో పోలో ఎప్పుడూ చైనా వెళ్లలేదనే వాదన కూడా ఉంది. మార్కోపోలో పలు‌సార్లు బీజింగ్ నుంచి కుబ్లా ఖాన్ ప్యాలస్‌ వరకు ప్రయాణించినప్పటికీ ఈ గోడను చూసేందుకు ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించ లేదు. 13వ శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించే వారు. జెంఘిజ్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర చైనాపై దాడికి పాల్పడినప్పుడు ఈ గోడ పాక్షికంగా ధ్వంసమైంది.

Recent

- Advertisment -spot_img