Homeజిల్లా వార్తలుశ్రీనివాసన్ మునుస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో.. నిరుపేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న బండారు...

శ్రీనివాసన్ మునుస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో.. నిరుపేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న బండారు దత్తాత్రేయ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: విద్య పట్ల ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సహిస్తున్న శ్రీనివాసన్ మునిస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రీనివాసన్ మునుస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో తమ ట్రస్ట్ సహకారంతో చదువుతున్న 22 విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా లాప్టాప్ లను అందజేశారు. ఉన్నత చదువులు చదివి తమలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలని దత్తాత్రేయ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శరత్ అద్దంకి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img