Homeఅంతర్జాతీయంటర్కీ ప్రెసిడెంట్​కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇండియా

టర్కీ ప్రెసిడెంట్​కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇండియా

న్యూఢిల్లీ: యూనైటెడ్​ నేషన్స్ ఆర్గనైజేషన్​(యూఎన్​ఓ) వేదికపై జమ్మూ కశ్మీర్​ అంశాన్ని లేవదీసినా టర్కీ ప్రెసిడెంట్ ​ ఎర్డోగన్‌కు ఇండియా దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం మాని.. మీ దేశ అంతర్గత విషయాలపై దృష్టి పెడితే బాగుంటుదని’ గట్టిగా సూచించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని టర్కీ ప్రెసిడెంట్​ ఎర్డోగన్​కు హితవు చెప్పింది.ఈ మేరకు యూఎన్​ఓలో ఇండియా ప్రతినిధి తిరుమూర్తి పేర్కొన్నారు.
యూఎన్​ఓ సర్వప్రతినిధి సభ 74వ యాన్యువల్​ మీటింగ్​లో టర్కీ ప్రెసిడెంట్​ ఎర్డోగన్​ వీడియో సందేశాన్ని వినిపించార. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్​ అంశాన్ని లేవనెత్తారు. 2019లోనూ ఎర్డోగన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి భారత్‌ ఆగ్రహానికి గురయ్యారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img