Homeఎడిటోరియల్​దేశం అంతా డాక్టర్లే

దేశం అంతా డాక్టర్లే

శ్రీ కృష్ణ దేవరాయలు ఓక రోజు సభ నిర్వహిస్తూ మన రాజ్యం లోప్రజలు ఏక్కువ మంది ఏ వృత్తీ లో ఉన్నారు అని ప్రశ్నించారు.

తమ ఏలుబడిలో వ్యవసాయ వృత్తిలో ఏక్కువ మంది ఉన్నారని, తరువాతి స్థానంలో వర్తకం చేస్తూ ఉన్నారని అన్నారు కొందరు.

రకాల వృత్తుల వారూ ఏక్కువ మంది ఉన్నారని ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పారు.

ఆఖరున వికట కవి తెనాలి రామ లింగడు లేచి మహారాజా మీ రాజ్యంలో అందరి కన్నా ఏక్కువ మంది వైద్యులు ఉన్నారని శ్రీ కృష్ణ దేవరాయల వారికి విన్నవించేడు..

వెటకారం చేస్తున్నాడని భావించిన మహారాజు వ్యవసాయములో ఎక్కువ మంది ప్రజలు ఉండవచ్చు. వ్యాపారం లో ఉండవచ్చు.

కానీ నువ్వేంటీ వైద్య వృత్తీలో ఏక్కువ మంది ఉన్నారని అంటున్నావు.. నాతోనే వేటకారమా రామ లింగా..

కాదు మహారాజా. 

నేను చేప్పేది నిజం నిరూపించ గలను మహారాజా అని వికట కవి అనగానే రామ లింగా నువ్వు అన్నది నిరూపించులేకుంటే నీకు శిరశ్చేదన దండన శిక్ష విధిస్తాను అని సభ చాలించారు.

మరునాడు తెల్లవారకుండా రామలింగడు మహా రాజును తీసుకుని తలకు శిరోభారము ఉన్నట్లుగా నుదుటీకీ కట్టు కట్టి మారు వేషాల్లో నగర సంచారం ప్రారంభించగానే గుడిలో అర్చకుడు ఏదురు పడి అయ్యా మీకు శీరోభారమా నుదిటికి కట్టు కట్టేరు..  

దీనికి తులసి రసం నుదుటికి రాస్తే శిరోభారం చిటికలో తగ్గిపోతుంది…

అని అయాచితంగా సలహా ఇచ్చి ముందుకు కదీలేడు రాజు గారు వికట కవి మరో నాలుగు అడుగులు ముందుకు కదలసాగారు.

నాగలి భుజాన వేసుకుని రైతు తారస పడి బాబు తల పోటా ఏమి రాసేవూ.. నేను ఓ చిట్కా చెపుతాను చెయ్యిఇలా తీసేసీనట్లు తగ్గి పోతుంది.

ఆవు నెయ్యి , హారతి కర్పూరం రంగరించి నుదుటిన పట్టు వెయ్యి, చిటికలో తల నొప్పి పోతుందని చెప్పి ముందుకు కదీలేడు ఇలా వికట కవి.

మహారాజుకు ఎదురు పడ్డ ప్రతి వ్యక్తీ వీరికి ఉచిత వైద్య సలహా ఇస్తూనే ఉన్నారు.

ఇదంతా చూసీ చూసిరాజు ఆశ్చర్యం చేందివికట కవి చేప్పింది నిజమేనని ఒప్పుకుని ఒక అగ్రహారం బహుమతిగా ఇచ్చారు.

ఆ అగ్రహారం పేరు అయాచితవైద్యఅగ్రహారంగా నిన్న మోన్నటి వరకూ పిలవ బడేదీ.

ఈ కధ ఏందుకూ అంటే …

నిన్న… నేడు… రేపు ఏ న్యూస్​ పేపర్​ చూసినా… ఏ న్యూస్ చానల్ చూసీనా… వాట్సాప్​ గ్రూప్ చూసినా… ఏక్కడ చూసినా ఏక్కడకు వేళ్ళినా… కరోనా ఉచిత వైద్యసలహాలే దేశం అంతా కరోనా రోగమయం కాదు.. కాదు అందరూ అయాచితంగావైద్య సలహామయం దేశం అంతా డాక్టర్ల మయం.

– రాగవల్లి పుష్ప

Recent

- Advertisment -spot_img