UPSC: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 28న సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Civil Services Prelims 2023) నిర్వహించగా, 16 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. 14,624 మంది అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించారు. వీరంతా ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్ (Civils Mains) పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు.