ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశంలోని దాదాపు ప్రతిచోటా యూరియా అమ్మకాలు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ అన్నారు. అవసరం మేరకు దేశీయ యూనిట్ల నుండి, దిగుమతుల ద్వారా సరఫరాను మరింతగా బలోపేతం చేయడానికి గాను భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు. కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ మంత్రి బి.సి. పాటిల్ ఈ రోజు న్యూఢిల్లీలో గౌడను కలిశారు.