HomeతెలంగాణV.Hanmantharao:షర్మిల తెలంగాణకు వద్దు ..ఏపీ కి బెస్ట్-కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

V.Hanmantharao:షర్మిల తెలంగాణకు వద్దు ..ఏపీ కి బెస్ట్-కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

V.Hanmantharao: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి వేవ్ స్టార్ట్ అయింది.. ఎవరి నోట చూసినా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వివరించారు. ముస్లింలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు.

ఎన్నికల కోసమే బీసీ బంధు
ఎన్నికల కోసమే బీసీ బంధు తీసుకొచ్చారని.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. హెచ్‌సీఏ భూముల లీజు తీసేసి.. రాజీవ్ పేరు తొలగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నా. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుంది. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలి. పబ్లిక్ సెక్టర్ అమ్మివేస్తుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు. 2024లో మోడీ పోయి రాహుల్ ప్రధాని కావాలని వీహెచ్ ఆకాంక్షించారు.

రెండ్రోజుల్లో ఢిల్లీకి
వైఎస్. షర్మిల రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలువనున్నారు . పార్టీ విలీనమా? పొత్తా? అన్న అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం . ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img