Homeతెలంగాణవంగరను చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతం

వంగరను చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతం

హైద‌రాబాద్ః దేశం గర్వించేవిధంగా మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహా రావు పుట్టిన ఊరు వంగరను గొప్ప చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కావల్సిన ప్రణాళికలు తయారు చేయనున్నట్లు రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్, క్రీడలు ,యువజన సంక్షేమం, టూరిజం మరియు కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు టూరిజం, సాంస్కృతిక శాఖ సెక్రెటరి కే యస్ శ్రీనివాస్ రాజు, రాష్ట్ర టూరిజం శాఖ ఏం డి మనోహర్ , సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ , శిల్పరామం ఈ ఈ అంజి రెడ్డి, ఆర్కియలోజిడిడి నారాయణల‌తో క‌లిసి మంత్రి వంగర ను సంద‌ర్శించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యటక కేంద్రంకు కావలసిన ఏర్పాట్ల పై పీవీ బంధువులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్థిక , రాజకీయ, భూ సంస్కరణలు చేసి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు . తెలంగాణ గడ్డ నుండి పట్వారీ నుండి ప్రధాన మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి, భూసంస్కరణలు చట్టం అమలు అయిన‌ప్పుడు మొదటగా తన 1000 ఏకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత పీవీకే ద‌క్కింద‌న్నారు.
పీవీ మ‌రణాంతరం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, పార్లమెంటులో కనీసం ఫోటో కూడా పెట్టలేక పోయారాన్నారు. ప్రపంచ స్థాయిలో పీవీ ఖ్యాతిని తెచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పీవీ పుట్టి పెరిగిన లక్నేపల్లి, వంగర గ్రామాలు టూరిజం కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రం నలుమూల నుండి పర్యాటకులు వచ్చే విధంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.
పీవీను స్ఫూర్తి గా తీసుకోవాలని ఆయన వాడిన వస్తువుల భవిష్యత్తు తరాల వారికి తెలియజేసే విధంగా భవనాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు. అతను వాడిన ప్రతి వస్తువు ఎప్పుడు ఏ పదవిలో ఉన్నప్పుడు వాడిన వివరాల సమాచారంతో పొందు పరచడం జరుగుతుందని, ప్రజల సమస్యల పై తన వద్దకు వస్తె తానే స్వయంగా టైప్ చేసి ఇచ్చేవారని గుర్తుచేశారు. అదే విధంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ను నేర్చుకొని కంప్యూటర్ కూడా తానే వినియోగించుకొని సమస్యలను ప్రభుత్వ దృష్టి కి తెచ్చి పరిష్కారం చేసే వారని గ్రామ ప్రజలు వివరించడం ఆయన గొప్ప తనానికి నిదర్శనం అన్నారు. అంతకు ముందు మంత్రి పీవీ నర్సింహ రావు గారు నివసించిన భవనాన్ని సందర్చించారు.
ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ రావు, పి వి నర్సింహ రావు కుటుంబ సభ్యులు శ్రీమతి వాణి దేవి, పి వి ప్రభాకర్ రావు కాశ్యప్, పి వి మదన్ మోహన్ రావు, వాసుదేవ రావు, అర్ డి ఓ వాసు చంద్ర, ఎసిపి రవీందర్, తహశీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, ఏం పి పి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img