Homeజిల్లా వార్తలుశాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలి: సీఐ మొగిలి

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలి: సీఐ మొగిలి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ యాదవ సంగం భవనంలో మండలంలోని వినాయక మంటపాల నిర్వాహకులతో ఎస్సై గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి కూడా పాల్గొన్నారు. వినాయక మండపాల నిర్వాహకులతో సీఐ మొగిలి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణం లో వినాయక పండుగను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని, నిమర్జనం రోజు డీజే కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , అన్ని మండపాల నిర్వాహకులు ఒకేరోజు నిమర్జనం అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు అన్నారు. ఈ సమావేశంలో ఎస్సై గణేష్, కానిస్టేబుల్ కాసిం, మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు, మాజీ ప్రజాప్రతిని తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img