Homeజిల్లా వార్తలుప్రభుత్వ జూనియర్ కళాశాలకు సరిగా హాజరుకాని విద్యార్థుల ఇళ్ల సందర్శన..!

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సరిగా హాజరుకాని విద్యార్థుల ఇళ్ల సందర్శన..!

ఇదేనిజం,గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లయ్య సూచనల మేరకు కళాశాలకు రెగ్యులర్ గా రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి పేరెంట్స్ తో మాట్లాడి విద్యార్థులకు 75% హాజరు లేనట్లయితే పరీక్ష ఫీజు తీసుకోమని స్కాలర్షిప్ రాదని అంతేగాక విద్యార్థులను ఇంటి దగ్గర చదివించమని మరియు రెగ్యులర్ గా కళాశాలకు పంపమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చరిత్ర అధ్యాపకులు రాంప్రసాద్, పౌరశాస్త్ర అధ్యాపకులు ప్రసాద్, శేకల్ల లొత్తునూరు గ్రామాలను సందర్శించడం జరిగింది.

Recent

- Advertisment -spot_img