– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అయోధ్య రామాలయాన్ని దర్శించుకొనేందుకు తమకు ఇన్విటేషన్ రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలుసున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడాతూ.. శ్రీరామచంద్రుడు అన్ని కులాలకు దేవుడేనని.. ఏదో ఒకరోజు తాను అయోధ్యను కచ్చితంగా దర్శించుకుంటానని చెప్పారు.