తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నిర్మాణానికి రూ.100కోట్లు ఇస్తామంటూ అదానీ ముందుకు వచ్చారు. అయితే యంగ్ అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అదానిపై జరుగుతున్న వివాదాలు కారణంగా ఆ నిధులును మేము తిరస్కరించాం అని తెలిపారు. టెండర్లను చట్టబద్ధంగా పోటీపడి గెలుచుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారు. పోటీపడే వారిలో అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఎవరైనా ఉండొచ్చు అని తెలిపారు. నేను ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తాన ..తప్పకుండా ఢిల్లీ నుంచి రాబెట్టుకోవలసిన నిధల అన్నిటిని రాబెట్టుకుంటాం.. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది..తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని తెలిపారు.