ఇదేనిజం, నర్సంపేట: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి అన్నారు. గురువారం చెన్నారావుపేట మండలంలోని లింగాపురం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని అభయహస్తం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజలందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. .గత ప్రభుత్వం పేదొల్ల కష్టాలు తిర్చకుండా వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారంటూ.. ఆరోపించారు.