Homeహైదరాబాద్latest Newsమీకు మేము అండగా ఉంటాం.. గ్రూప్ 1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ

మీకు మేము అండగా ఉంటాం.. గ్రూప్ 1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ

తెలంగాణ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం ముగిసింది. గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్‌ను కలవాలని కోరడంతో తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయనను కలిశారు.జీవో నంబర్ 29ని తొలగించాలని కొందరు అభ్యర్థులు కేటీఆర్‌ను కోరగా.. ఈ జీవో వల్ల నష్టపోతామని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్‌ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్‌కు సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తప్పకుండా సహకరిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళితే పార్టీకి అండగా నిలుస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు.గ్రూప్-1 మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

Recent

- Advertisment -spot_img