– ఇండియా కూటమి కకావికలం
– బీఆర్ఎస్ పార్టీని పట్టించుకొనే నాథుడే లేడు
– సర్పంచ్లకు గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
– వారి పోరాటానికి మద్దతు ఇస్తాం
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
ఇదేనిజం, కరీంనగర్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 10 స్థానాలు తాము గెలుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి కకావికలం అవుతోందన్నారు. సర్పంచ్లకు గత ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. గత ప్రభుత్వం సర్పంచ్ లకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం హయంలోనే సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి 400, బీజేపీ 350 సీట్లు గెలుస్తుందని చెప్పారు. కరీంనగర్ లో బీజేపీకి అభ్యర్థి లేడని.. అందుకే పక్క జిల్లా నుంచి తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో కేసీఆర్ ఎలా సీఎం అవుతారో .. కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కారు షెడ్డు కి పోయిందని చెప్పారు. గత ప్రభుత్వం సర్పంచుల సమస్యలు పట్టించుకొలేదని, సర్పంచ్ల సమస్యలు ఈ ప్రభుత్వం అయిన పట్టించుకొవాలన్నారు. కోట్ల రూపాయల నిధులు దారి మళ్లుతున్నాయని చెప్పారు.