ఇదేనిజం, నల్లగొండ: పెళ్లి బస్సు బోల్తా పడటంతో మహిళ మృతి చెందింది. మరో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా చింతపల్లి శివారులో అదుపు తప్పి బోల్తాపడిరది. దీంతో ఓ మహిళ మృతి చెందగా మరో పదిమందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం నందిగామ వద్ద ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.