HomeతెలంగాణWhat face is Modi coming to Palamur? : మోడీ ఏ ముఖం పెట్టుకొనిపాలమూరుకు...

What face is Modi coming to Palamur? : మోడీ ఏ ముఖం పెట్టుకొనిపాలమూరుకు వస్తున్నారు?

– తెలంగాణ డబ్బులతోనే ప్రాజెక్టులు కట్టుకుంటాం
– కృష్ణానదిలో నీటి వాటా మాత్రం తేల్చాలి
– మంత్రి శ్రీనివాసగౌడ్​

ఇదేనిజం, హైదరాబాద్​: ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్​ ఆరోపించారు. తెలంగాణ డబ్బులతోనే ప్రాజెక్టులు కట్టుకుంటామని.. కానీ కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్​ చేశారు. ఈ నెల 1న(రేపు) పాలమూరు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ స్పందించారు.

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం శ్రీనివాసగౌడ్​ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోడీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img