Homeహైదరాబాద్latest News15 ఏండ్లల్లో 100కు పైగా సినిమాలు చేసిన ఆ నటి ఏమైపోయింది?

15 ఏండ్లల్లో 100కు పైగా సినిమాలు చేసిన ఆ నటి ఏమైపోయింది?

ఆ నటి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ర హీరోలందరితో నటించి ఆడియన్స్​ మెప్పించింది. సినీ పరిశ్రమలోకి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోస్, పిల్లల వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తెలుగులో ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉందొ చెప్పడం కష్టం .ఇంతకీ ఆమె ఎవరో జ్ఞాపకం వచ్చిందా. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. నటి రంభ. 1992లో సీనియర్ హీరో వినీత్ జోడిగా స్వర్గం సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రంభ. అప్పుడు ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అదే ఏడాది సాంబకుళం దాచన్ చిత్రంలో నటింటింది. 1993లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమిళంలో ఉఝవన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రంభ. మెగాస్టార్ చిరంజీవి సరసన బావగారూ బాగున్నారాలో నటించింది. బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లుడా మాజాకా, అల్లరి ప్రేమికుడు, చిన్నల్లుడు, చూసొద్దాం రండి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిసారిగా అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది రంభ. ఆమె చివరిసారిగా పెన్ సింగం సినిమాలో నటించింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకున్నది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. విదేశాల్లోనే స్థిరపడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img