Homeజాతీయంమూడేండ్లుగా ఏం చేస్తున్నారు?

మూడేండ్లుగా ఏం చేస్తున్నారు?

– బిల్లులు ఎందుకు ఆమోదించలేదు
– తమిళనాడు గవర్నర్​ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం
– గవర్నర్లు శాసనసభలో భాగమే

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: బిల్లులు ఆమోదించకుండా మూడేండ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్​ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమేనని గుర్తు చేశారు. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మరోవైపు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్‌లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు.

Recent

- Advertisment -spot_img