Homeజాతీయంకాంగ్రేస్​ కలహాలు కొలిక్కి వచ్చేనా...

కాంగ్రేస్​ కలహాలు కొలిక్కి వచ్చేనా…

రాహుల్​ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రేస్​ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సోనియా గాంధీ అధ్యక్ష్యతపై 23 మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు లేఖ రాయడంతో రాహుల్​ గాంధీ సీనియర్లపై బగ్గుమన్నారు. ఈ క్రమంలో  ఈరోజు జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో కాంగ్రెస్ నాయకులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబాల్ ఓ ట్వీట్ చేశారు. 30 ఏళ్ల‌లో ఏనాడూ బీజేపీకి అనుకూలంగా తాను ఎప్పుడూ వ్యవహరించలేద‌ని సిబాల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌లు బాధ‌పెట్టిన‌ట్లు ఆయన ట్వీట్​లో తెలిపారు. కాంగ్రేస్​ ముఖ్య నేత గులాం న‌బీ ఆజాద్ కూడా రాహుల్ పై సీరియ‌స్ అయ్యారు. అనంతరం కాసేపటికి సిబాల్​ రాహుల్​తో మాట్లాడినట్లు, రాహుల్​ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకునట్లు తెలిపి తన ట్వీట్​ను డిలేట్​ చేశారు. ఇక గులాం నబీ ఆజాద్​ ఎలా స్పందిస్తారో చూడాలి

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img