తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో..తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్ 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత అని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదు అని ఆరోపించారు. ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో ?.. ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో? అని కేటీఆర్ ప్రశ్నించారు. మీ బడెబాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది.. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు.. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది.. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది అని నిలదీశారు.కానీ మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్దిఅనే కేటీఆర్ తెలిపారు.