Homeఫ్లాష్ ఫ్లాష్భర్తను రూ.15కోట్లకు అమ్మిన భార్య

భర్తను రూ.15కోట్లకు అమ్మిన భార్య

భోపాల్: భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఓ బాలిక ఫిర్యాదు చేసింది.

తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని కోర్టుకు విన్నవించింది.

తండ్రి వివాహేతర సంబంధంతో తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువు పాడవుతుందని కోర్టకు విన్నవించింది.

దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించగా, అతని వివాహేతర బంధం నిజమేనని తేలింది.

అయితే భర్త ప్రియురాలితోనే ఉంటానని కోర్టుకు చెప్పాడు.

దీంతో తన భర్తను రూ. 15 కోట్లకు అతడ్ని ప్రేమించిన ప్రియురాలికి ఆ భార్య అమ్మేసింది.

ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Recent

- Advertisment -spot_img