Homeతెలంగాణరేపు రాష్ట్రంలో వైన్స్ బంద్

రేపు రాష్ట్రంలో వైన్స్ బంద్

– ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిర్ణయం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు వైన్స్​ బంద్​ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి (సోమవారం) ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు బంద్ చేయనున్నారు. రూల్స్​ బ్రేక్​ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ హెచ్చరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 49 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img