Homeహైదరాబాద్latest Newsపత్తి ఏరుతన్న మహిళపై Tiger Attacked.. మృతి

పత్తి ఏరుతన్న మహిళపై Tiger Attacked.. మృతి

మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ శివారా గ్రామంలో ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పత్తి చేనులో పని చేస్తున్న మహిళపై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

వివరాల ప్రకారం చనిపోయిన మహిళ పేరు సుష్మా దేవిదాస్ మండల్ (55)గా వెల్లడైంది. ఆదివారం ఉదయం 11గంటలకు చేనులో పత్తి ఏరుతున్న పులి వెనుక నుంచి వచ్చి దాడి చేయడంతో సుష్మ మండల్ అక్కడికక్కడే మృతిచెందింది. అయితే పత్తి తీస్తున్న మహిళలు భయంతో కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. మృతురాలు గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తూ వ్యవసాయ పనులకు వెళ్తుండేదని గ్రామస్తులు తెలిపారు.

కాగా తెలంగాణకు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని అహేరి జిల్లాలో పులుల దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి కావడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img