మెల్బోర్న్ టెస్టులో ఓడి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఫైనల్కు చేరాలంటే అదృష్టం కలిసి రావాలి. ఆసీస్తో సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అంతేకాక, జనవరి ఆఖర్లో ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటేనే భారత్ ఫైనల్కు చేరుతుంది.