YCP : ఏపీలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై వైసీపీ పార్టీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) పార్టీ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్పెట్టింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు గన్నవరం కేసు వెనుక ఉన్న నిజం బయటపడుతుంది అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్లోని జిల్లా జైలులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు.