వేసవి ఇప్పుడే మొదలైంది. దీంతో ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు గ్యాప్ లేకుండా వాడేస్తుంటారు. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుంది. ఎంత ప్రయత్నించినా ఈ బిల్లుల మొత్తాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అయితే ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఈ వేసవిలో మీ విద్యుత్ బిల్లులో సగం ఆదా చేసుకోవచ్చు.
- రాత్రి రెండు లేదా మూడు గంటల పాటు ఏసీ ఆన్ చేసి తర్వాత ఆపేసినా తెల్లవారే వరకు గదిలో చల్లదనం ఉంటుంది.
- ఏసీ, కూలర్లు వినియోగించే క్రమంలో కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలి.
- ఏసీని ఎల్లప్పుడు 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి. దీంతో 24 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది.
- ఏసీలో ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్తు బిల్లు ఆదా చేసుకోవచ్చు. ఎక్కువ మంది 18 డిగ్రీల వద్ద పెడుతుంటారు. ఫలితంగా బిల్లు పెరుగుతుంది.