ఇదేనిజం, బెంగళూర్: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్లో ఫొటోషూట్కు తల్లిదండ్రులు అంగీకరించలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుధామనగర్కు చెందిన ఓ యువతి (21) ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. బీబీఏ చదువుతోంది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఒక మాల్లో ఫొటోషూట్ చేయాలనుకొంది. ఇందుకు తల్లిదండ్రులను అనుమతి కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు చేసుకుంది. మరుసటి రోజు గదిలో తమ కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె గదిని పరిశీలించిన వారు అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ను గుర్తించలేదు. దీంతో ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.