సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని శుక్రవారం బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చదువు ఇష్టం లేకనే రేణుశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని శిల్పాబృందావన్ కాలనీ ఎల్లమ్మబండకి చెందిన ఎం.రేణుశ్రీ (18) గీతం యూనివర్సిటీలో బీటెక్(సీఎస్సీ) మొదటి సంవత్సరం చదువుతుంది.