Homeహైదరాబాద్latest NewsCrime News : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Crime News : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఇదేనిజం, శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్​ఐ రఘు కథనం ప్రకారం హిమ బిందు(31) ప్రైవేట్ జాబ్ తన భర్త కీర్తి శేఖర్​తో కలిసి (AP04BF1407) బైక్‌పై సాయిబాబా దేవాలయం సమీపంలోని ఓల్డ్ ఎంఐజీ నుంచి ఆర్సిపురంలోని తమ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో హోండా యాక్టివా స్కూటీ (TS07JS4592)పై శెట్టి అఖిలేష్ (20)మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాంగ్ డైరెక్షన్‌లో వచ్చి వారి బైక్‌ని ఢీ కొట్టడంతో వారిద్దరూ కిందపడ్డారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే యాక్టివా నడుపుతున్న వ్యక్తి అఖిలేష్ తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలికి పరిశీలించి చనిపోయిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img