YS Sharmila : ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నాం అని షర్మిల అన్నారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ ఎంపీలు తమ గళం విప్పాలి అని అన్నారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోడీ గారిని నిలదీయాలి అని తెలిపారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నాం అని వైఎస్ షర్మిల అన్నారు.