టీ20 ప్రపంచకప్లో భారత జట్టు జూన్ 9న పాక్ను ఢీకొట్టనుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్-పాక్ మ్యాచ్ అంటేనే భావోద్వేగంతో కూడుకుంది. మనం గెలిస్తే.. మనవరకే సంబరాలు చేసుకుంటాం. ఓడితే మరోవిధంగా బాధపడతాం. కానీ, మనం గెలిచినా.. ఓడినా పాక్ అభిమానులు మాత్రం మనపైనే పడతారు. అదే ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్కున్న వ్యత్యాసం’’అని యువరాజ్ వ్యాఖ్యానించాడు.