గుండెపోటుతో
ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం
Gudem Mahipal Reddy:ఇదేనిజం, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు.. విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. గత కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి నివాసానికి తీసుకువచ్చారు.