మహిళలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఈ కార్యక్రమం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి జీవనశైలిని మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.