Homeహైదరాబాద్latest NewsCMRF ద్వారా 1.30 లక్షలు మంజూరు చేయించిన జగదీశ్వర్ గౌడ్

CMRF ద్వారా 1.30 లక్షలు మంజూరు చేయించిన జగదీశ్వర్ గౌడ్

ఇదేనిజం, శేరిలింగంపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.1.30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ అనేది పేదల పాలిట వరమని ఆయన పేర్కొన్నారు. వివేకానంద నగర్ డివిజన్‌కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవలే అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మంజురు పత్రాలను జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img