దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతంగా విజృంభిస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ప్రతి రోజు దాదాపు 60 వేల కేసులకు పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యదిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ ఉంది. తాజాగా దేశ వ్యాప్తంగా 64399 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 861 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 6.28 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కేసులతో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. తాజాగా దేశంలో 53879 మంది కోలుకోగా రికవరీ రేటు 68.78 శాతంగా ఉంది. మరణాల రేటు 2.01 గా ఉంది. దేశంలో రోజుకు 6 లక్షల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.