Homeహైదరాబాద్latest News15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ :  నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అసిఫాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఏరియా, ఎల్లూరు గ్రామం లో తణిఖీలు చేపట్టారు. పెంచికల్‌పేట్ మండలం లోని వివిధ గ్రామాల నుంచి మహారాష్ట్రకు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఎల్లూరు గ్రామం లోని ఎం డి.ముబాషీర్ తండ్రి మోసిన్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ సీఐ సీహెచ్ రాణా ప్రతాప్ తెలిపారు.
టాస్క్ ఫోర్స్ సీఐ CH. రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పీసీ మధు, రమేష్, సంజీవ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img