Homeతెలంగాణపెట్రోల్​ ట్యాంకర్​ పేలి 40 మంది మృతి

పెట్రోల్​ ట్యాంకర్​ పేలి 40 మంది మృతి

– 83 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
– లైబీరియాలోని టొటాటోలో ఘటన

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో : లైబీరియాలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 40 మంది మృతిచెందారు. మరో 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లైబీరియాలోని టొటాటోలో ఈ ప్రమాదం జరిగింది. బోల్తాపడిన ట్యాంకర్​ నుంచి ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి జనం ఎగబడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో మృతదేహలను సమాధిలో పూడ్చి పెట్టారు. మృతదేహలు గుర్తు పట్టని విధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మృతదేహలు కాలి బూడిదగా మారాయి. మృతులను గుర్తించడం కష్టంగా మారిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. లైబిరియా వైస్ ప్రెసిడెంట్ జ్యువెల్ హోవార్డ్ టేలర్ సామూహిక అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభిస్తామని మేం ఊహించలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం’ అని హోవార్డ్​ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img